ప్రభుత్వ ట్రాక్టర్‌లో ఊరేగింపు.. తీవ్ర విమర్శల పాలవుతున్న టీఆర్‌ఎస్ పార్టీ

by  |
tractor
X

దిశ, ఆందోల్: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన చావు డప్పు కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం అక్సాన్పల్లిలో చేపట్టిన కార్యక్రమంలో గ్రామపంచాయతీకి సంబంధించిన ప్రభుత్వ ట్రాక్టర్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ఊరేగింపు చేయడం పలు విమర్శలకు దారి తీసింది. అధికార పార్టీ‌కి చెందిన సర్పంచ్ కావడంతో గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ను పార్టీ సొంత కార్యక్రమానికి వాడుకోవడం అధికార దుర్వినియోగమేనని విమర్శిస్తున్నారు. గ్రామ సర్పంచ్ నరేందర్ రెడ్డి, పంచాయతీ సెక్రెటరీ లపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో కార్యాలయంలో మహేష్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ట్రాక్టర్‌లో దిష్టిబొమ్మను ఊరేగిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో కొందరు నెటిజన్లు టీఆర్ఎస్ పార్టీ తీరును విమర్శిస్తున్నారు.

Next Story

Most Viewed