- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిల్లలు లేరని భార్యతో గొడవ.. చివరకు కానిస్టేబుల్ ఏం చేశాడంటే..!
<p>దిశ, రాజేంద్రనగర్ : సంతానం కలగడం లేదని భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం చివరకు భర్త ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం.. శివరాంపల్లిరెడ్డి కాలనీలో ఉండే బండి వాసు నేషనల్ పోలీస్ అకాడమీలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. గత కొన్నేండ్ల వాసు నీలిమ అనే మహిళను పెండ్లి చేసుకున్నాడు. వివాహం జరిగి ఏండ్లు గడుస్తున్న వీరికి సంతానం కలుగలేదు. ఈ […]</p>

X
దిశ, రాజేంద్రనగర్ : సంతానం కలగడం లేదని భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం చివరకు భర్త ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం.. శివరాంపల్లిరెడ్డి కాలనీలో ఉండే బండి వాసు నేషనల్ పోలీస్ అకాడమీలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. గత కొన్నేండ్ల వాసు నీలిమ అనే మహిళను పెండ్లి చేసుకున్నాడు. వివాహం జరిగి ఏండ్లు గడుస్తున్న వీరికి సంతానం కలుగలేదు. ఈ నేపథ్యంలోనే భార్యాభర్తల నడుమ గొడవలు జరిగేవి. ఆదివారం కూడా రోజువారీగా డ్యూటీకెళ్లి ఇంటికొచ్చిన వాసు-భార్య నీలిమ మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన వాసు బెడ్ రూమ్లోకి వెళ్లి ఉరివేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నట్టు సీఐ తెలిపారు.
Next Story






