- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘వారణాసి’ స్టోరీ లీక్ చేసిన విజయేంద్ర ప్రసాద్.. ఆ ఇద్దరి మధ్యే యుద్ధం అంటూ ఆసక్తికర కామెంట్స్
‘రామ-కుంభకర్ణ’ యుద్ధం నేపథ్యంలో సాగే ఒక అరగంట హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతోందని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వారణాసి’. ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ ఇదేనంటూ ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో రామాయణంలోని ‘రామ-కుంభకర్ణ’ యుద్ధం నేపథ్యంలో సాగే ఒక అరగంట హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతోందని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ట్రైలర్లో చూసినట్లుగా హనుమంతుడి తోక, రథం వంటి అంశాలతో కూడిన ఈ యుద్ధం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
తాజా సమాచారం ప్రకారం.. ఈ 30 నిమిషాల పోరాట ఘట్టం సినిమాకే అతిపెద్ద హైలైట్గా నిలవనుందని టాక్. ఇందులో మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేస్తుండటం విశేషం. ఆయన ఆధునిక అడ్వెంచరర్ ‘రుద్ర’ పాత్రతో పాటు, ‘శ్రీరాముడి’ పాత్రలోనూ కనిపించనున్నారట. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విభిన్న లొకేషన్లలో షూటింగ్ జరుపుకుంటున్న ‘వారణాసి’, అంటార్కిటికా ఖండంలో భారీగా షూటింగ్ జరుపుకున్న మొదటి భారతీయ సినిమాగా చరిత్ర సృష్టించింది. ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ విజువల్ వండర్ను 2027లో థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్ ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. ఇక ఈ విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. థియేటర్స్లో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






