అక్కినేని హీరోలకు దోషం ఉంది.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 6 |
అక్కినేని హీరోలకు దోషం ఉంది.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో అక్కినేని హీరోల హవా తగ్గిపోయింది. నాగార్జునతో పాటు ఆయన తనయులు నాగచైతన్య, అఖిల్ వరుస ప్లాపులతో బాగా సతమతం అవుతున్నారు. మన్మథుడుతో పాటు గతేడాది నటించిన ది ఘోస్ట్ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచాయి. అయితే అప్పటి నుంచి ఆయన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. ఇక నాగచైతన్య విషయానికి వస్తే.. ఇటీవల వచ్చిన థాంక్యూ, కస్టడీ ఫ్లాప్‌గా నిలిచాయి. అఖిల్ రీసెంట్ సినిమా ‘ఏజెంట్’ భారీ అంచనాల నడుమ విడుదలైనా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.

తాజాగా, అక్కినేని హీరోలు వరుస ప్లాపులపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నాగార్జున కుటుంబంలో వంశ దోషం ఉంది. అందుకే ఆ ఫ్యామిలీలో విడాకులు జరిగాయి. ఆ దోషం వల్లే అక్కినేని హీరోలు వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్నారు’’ అంటూ చెప్పుకొచ్చారు.

Also Read: అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పిన జబర్దస్త్ కమెడియన్!

Next Story