- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'రీ రిలీజ్ దండయాత్ర' రెడీగా ముగ్గురు స్టార్ హీరోస్ మూవీస్
'రీ రిలీజ్ దండయాత్ర' 'రేసుగుర్రం', 'ఊసరవెల్లి', 'అతిధి' సినిమాలు మరికొన్ని రోజుల్లోనే రీ రిలీజ్ కానున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో ఈ మధ్యకాలంలో అనేక సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాలు పెద్ద ఎత్తున ఈ ట్రెండ్ను ఫాలో అవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు నటించిన కొన్ని చిత్రాలు తాజాగా రీ రిలీజ్కు సిద్ధమవుతున్నాయి.
రేసుగుర్రం
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 7 నుంచి 12 తేదీల మధ్య ఈ చిత్రాన్ని ఓవర్సీస్లో రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా, తమన్ సంగీతం అందించాడు.
ఊసరవెల్లి
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
అతిథి
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, అమృతా రావు హీరోయిన్గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మే 29న రీ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ మూడు చిత్రాలకు కూడా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించడం విశేషం.






