- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ సినిమా ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోతుంది..
తెలుగు వెండితెరపై మరో భక్తిరస చిత్రం కనువిందు చేయబోతోంది.

దిశ, సినిమా: తెలుగు వెండితెరపై మరో భక్తిరస చిత్రం కనువిందు చేయబోతోంది. అనంత ఆర్ట్స్ బ్యానర్పై కృష్ణ ఇస్లావత్, సాయి చక్రవర్తి, కేశవర్థిని, బేబీ రిషిత ప్రధాన పాత్రల్లో, నర్సింగ్ రావు(Narsingh Rao) దర్శకత్వంలో బొజ్జ రాజ గోపాల్, దోరవేటి సుగుణ నిర్మించిన చిత్రం ‘శివ శంభో’(Shiva Shambho). తనికెళ్ళ భరణి(Tanikella Bharani), సుమన్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఈనెల (ఏప్రిల్) 25న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డా. గోరటి వెంకన్న(Gorati Venkanna), బీజేపీ నేత, జంతు ప్రేమికుడు చీకోటి ప్రవీణ్, ప్రముఖ నటుడు, రచయిత డా.
తనికెళ్ల భరణి, బర్దీపుర పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వర గిరి స్వామీజీ, ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్, చిత్రపురి కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్, తదితరులు పాల్గొని చిత్రయూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. చిత్రయూనిట్ సభ్యులందరికి పేరుపేరున శుభాకాంక్షలు, అభినందనలు. ఇలాంటి భక్తిరస చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి. భారతీయ కళలైన సంగీతం, సాహిత్యం, నృత్యం ప్రధానాంశాలుగా కలిగిన ఈ సందేశాత్మక చిత్రాన్ని ప్రతి ఒక్కరు ఆదరించగలరనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
బీజేపీ నేత, జంతు ప్రేమికుడు చీకోటి ప్రవీణ్ మాట్లాడుతూ.. ‘‘నర్సింగ్ రావు గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోతుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. తెలుగు చిత్రసీమలో ఇది చెప్పుకోదగ్గ సినిమాగా నిలవాలని కోరుకుంటున్నాను’’. అని అన్నారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ.. ‘‘సంగీతం, సాహిత్యం, నృత్యం ప్రధానాంశాలుగా కలిగిన ఈ అరుదైన సినిమాను మనమంతా గౌరవించాలి. ఇటువంటి చిత్రాలను ఉత్తమ అభిరుచి గల ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. చిత్రయూనిట్ సభ్యులందరికి పేరుపేరున శుభాకాంక్షలు, అభినందనలు అని అన్నారు.






