- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Operation Sindoor: యుద్ధంలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం నన్ను బాధిస్తోంది.. మెగా బ్యూటీ ఎమోషనల్ పోస్ట్

దిశ, సినిమా: పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించింది. సరిహద్దుల్లో పరిస్థితులు తీవ్రఉద్రిక్తతగా మారుతున్నాయి. ఇరు దేశాలు దాడులు చేసుకుంటున్న తరుణంలో కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో.. పలువురు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. తాజాగా, జాన్వీ కపూర్(Janhvi Kapoor) రియాక్ట్ అవుతూ నోట్ విడుదల చేసింది. ‘‘గత రాత్రి సోషల్ మీడియాలో చూసిన విజ్వల్స్ ఓ సినిమాలా అనిపించాయి. అయితే అలాంటివి విదేశాల్లో జరుగుతుంటే శాంతిని పాటించాలని అనుకున్నా. కానీ అదే పరిస్థితి మన వరకు వచ్చింది.
దశాబ్దాలుగా ఇలాంటి దాడులు ఎదుర్కొన్న తర్వాత ఇప్పుడు తిరిగి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. మన సాయుధ దళాల శత్రుదేశంపై పోరాటం చేస్తున్నాయి. మన సార్వభౌమత్వాన్ని సైనికులు రక్షిస్తున్నారు కాబట్టి వారి కోసం ప్రార్థిస్తున్నాము. హిందూ , ముస్లీం, సిక్కూ, క్రిస్టియన్, భౌద్ధ అని తేడా లేకుండా మనమంతా కలిసికట్టుగా ఉందాం. పాకిస్తాన్కు గట్టిగా బదులిస్తామని వారికి తెలిసేలా చేద్దాం. ఈ యుద్ధంలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం నన్ను బాధిస్తోంది. త్వరలోనే దీనికి శాశ్వతంగా ముగింపు పలకాలని ఆశిస్తున్నాను. మనల్ని విభజించడానికి అనుమతించినట్లయితే నేరస్థులు పొందే ఏకైక దృశ్యం అదే.
ఆ స్వభావాన్ని అధిగమించాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నా. తీవ్రవాదంపై భారతదేశం చేస్తుంది.. తీవ్రవాదం కాదు. అది మనుగడ కోసంచేసే చర్య’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతుండటంతో అవి చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, జాన్వీ కపూర్ సినిమాల విషయానికొస్తే.. ఈ అమ్మడు ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ‘పెద్ది’( peddi) చిత్రంలో నటిస్తోంది. బుచ్చిబాబు(Buchibabu) దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.