ఆ వ్యాధి శాపం కాదు.. ముందస్తుగా గుర్తిస్తే సాధారణ జీవితాన్ని ఆస్వాదించవచ్చు.. చిరంజీవి మోటివేషనల్ కామెంట్స్

by I. Sairam |

బుధవారం అంతర్జాతీయ క్యాన్సర్ డే(Cancer Day) అన్న సంగతి తెలిసిందే.

ఆ వ్యాధి శాపం కాదు.. ముందస్తుగా గుర్తిస్తే సాధారణ జీవితాన్ని ఆస్వాదించవచ్చు.. చిరంజీవి మోటివేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బుధవారం అంతర్జాతీయ క్యాన్సర్ డే(Cancer Day) అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యాన్సర్‌పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేలా ఆయన మోటివేషనల్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘చాలామంది క్యాన్సర్ అనగానే జీవితం ముగిసినట్లే అనుకుంటున్నారు. కానీ ఇది దేవుడు ఇచ్చిన శాపం కాదు.

మన జీవనశైలిలోని అలవాట్ల వల్లే ఎక్కువగా వస్తుంది. ముందస్తుగా గుర్తిస్తే క్యాన్సర్‌ను పూర్తిగా జయించి సాధారణ జీవితాన్ని ఆస్వాదించవచ్చు. ఈ కార్యక్రమంలో క్యాన్సర్‌ను జయించిన రోగులను చూసి డాక్టర్లు ఎంత కష్టపడుతున్నారో అర్థమవుతోంది. చిన్న వయసు పిల్లలు కూడా ఈ వ్యాధికి గురవడం బాధాకరం. ప్రతి ఒక్కరూ లక్షణాలపై అవగాహన పెంచుకుని వెంటనే వైద్యులను సంప్రదించాలి’ అని చెప్పుకొచ్చాడు చిరంజీవి. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇక అతని సినిమాల విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) రీసెంట్‌గా ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Varaprasad Garu) చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక చిరంజీవి ప్రజెంట్ ‘విశ్వంభర’(Viswambhara) మూవీతో బిజీగా ఉన్నాడు. దర్శకుడు వశిష్ఠ(Vasista) తెరకెక్కిస్తున్న విజువల్ ఫాంటసీ ఇప్పటికే అన్ని కార్యక్రమాలు దాదాపు పూర్తి చేసుకుంది. వీఎఫ్‌ఎక్స్ పనుల కారణంగా ఆలస్యమైన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. త్రిష(Trisha) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. అలాగే ఇందులో యంగ్ బ్యూటీ అషికా రంగనాథ్(Ashika Ranganath) కూడా హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమాతో పాటు చిరు బాబీ(Bobby Kolli) దర్శకత్వంలో తన నెక్స్ట్ చిత్రం ‘మెగా 158’ (Mega 158) కోసం సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కేవీఎన్(KVN Productions) ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె. నారాయణ(K. Narayana) నిర్మిస్తున్నారు. ఇక ఇందులో స్టార్ హీరోయిన్ ప్రియమణి(Priyamani) కథానాయికగా యాక్ట్ చేస్తుంటే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal) ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడట. అలాగే ‘దురంధర్’(Durandhar) మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సారా అర్జున్(Sara Arjun) చిరంజీవి డాటర్‌గా యాక్ట్ చేస్తున్నట్లు సమాచారం.

Next Story