- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుడు వద్దన్న హీరోనే సెట్ చేసిన 'రాజు వెడ్స్ రాంబాయి' దర్శకుడు
'రాజు వెడ్స్ రాంబాయి' దర్శకుడు సాయిలు కంపాటి, తన తదుపరి చిత్రాన్ని సుమంత్ ప్రభాస్తో తెరకెక్కించనున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతి ఏడాది ఎంతో మంది కొత్త దర్శకులు అడుగుపెడుతుంటారు. అయితే వారిలో కొంతమంది మాత్రమే తమ తొలి చిత్రంతోనే విజయం, గుర్తింపు సాధిస్తారు. అలాంటి వారిలో దర్శకుడు సాయిలు కంపాటి ఒకరు. ఆయన 'రాజు వెడ్స్ రాంబాయి' చిత్రంతో దర్శకుడిగా పరిచయమై తొలి సినిమాతోనే మంచి విజయాన్ని, క్రేజ్ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత సాయిలు కంపాటి తదుపరి సినిమా ఎవరితో ఉంటుందనే ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఆయన తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ యంగ్ హీరో సుమంత్ ప్రభాస్తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్పై ఏసియన్ సునీల్, రామ్ మోహన్ రావు నిర్మించనున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందించనున్నారని తెలుస్తోంది. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సాయిలు కంపాటి మాట్లాడుతూ, 'రాజు వెడ్స్ రాంబాయి' కథను మొదటగా సుమంత్ ప్రభాస్కే వినిపించినట్లు తెలిపారు. కథ ఆయనకు బాగా నచ్చినా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయారని వెల్లడించారు. దీంతో ఇప్పుడు సాయిలు కంపాటి–సుమంత్ ప్రభాస్ కాంబినేషన్లో రాబోయే సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది.






