- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Patna: పుష్పా-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఉద్రిక్తత.. ప్రేక్షకులపై పోలీసుల లాఠీఛార్జ్
పుష్పా-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది...

దిశ, వెబ్ డెస్క్: పుష్పా-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్(Pushpa 2 Trailer Launch Event)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రేక్షకుల(Audience)పై పోలీసులు లాఠీ చార్జ్(Police Lathi Charge) చేశారు. ఈవెంట్ జరుగుతున్న సమయంలో పోలీసులపై కొందరు ప్రేక్షకులు చెప్పులు విసిరారు. దీంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత సీరియస్గా చెప్పినా వినకపోవడంతో లాఠీలకు పని చెప్పారు.
కాగా బీహార్ రాష్ట్రం పాట్నా(Bihar State Patna)లో జరిగిన పుష్పా-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. గాంధీ మైదాన్(Gandhi Maidan)లో జరిగిన ఈ ఈవెంట్కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 1200 పోలీసులతో సెక్యూరిటీ కల్పించారు. అయితే అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక(Rashmika)ను చూసేందుకు ప్రేక్షకులు ఒక్కసారిగా ఎడబడ్డారు. దీంతో పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ బన్నీ ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలీసులపై చెప్పులు విసిరారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు పరిస్థితిని పోలీసులు అదుపు చేశారు.
Read More...






