- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్యూడ్ దర్శకుడితో శింబు.. రంగంలోకి టాలీవుడ్ టాప్ బ్యానర్
డ్యూడ్ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన కీర్తిశ్వరన్ దర్శకత్వంలో శింబు తన తదుపరి చిత్రాన్ని చేయనున్నారు.

దిశ, వెబ్ డెస్క్: తమిళ నటుడు శింబు (సిలంబరసన్ టీఆర్) ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆరాసన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొనసాగుతుండగానే, ఆయన మరో కొత్త ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డ్యూడ్ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన కీర్తిశ్వరన్ దర్శకత్వంలో శింబు తన తదుపరి చిత్రాన్ని చేయనున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. అయితే ఈ సినిమాకు ఇంకా అధికారిక టైటిల్ ప్రకటించలేదు. ప్రస్తుతం ‘STR 52’ అనే వర్కింగ్ టైటిల్తో చిత్రీకరణను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు హీరో, దర్శకుడు, నిర్మాణ సంస్థ వివరాలు తప్పితే ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన ఇతర అప్డేట్స్ బయటకు రాలేదు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశముంది.






