- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
‘ప్రతీకారం తీర్చుకునే దేశాన్ని కాదు.. సరిహద్దులు దాటి భీభత్సాన్ని సృష్టించే వారిని ప్రశ్నించండి’.. స్టార్ హీరోయిన్ పోస్ట్ వైరల్

దిశ, వెబ్డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ బ్యూటీ 2014 లో మోడలింగ్ ప్రారంభించి.. అదే ఏడాదిలో క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. క్లీన్ అండ్ క్లియర్ బ్రాండ్ అంబాసిడర్గా కూడా చేసింది. తర్వాత నేషనల్ క్రష్ కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
తర్వాత ఈ హీరోయిన్ పునీత్ రాజ్ కుమార్ సరసన అంజని పుత్ర, గణేష్కు జోడిగా ఛమక్ అనే మూవీల్లో అవకాశం కొట్టేసింది. నాగశౌర్యతో కలిసి ఛలో సినిమాలో అదర్భుతంగా నటించి.. తన క్యూట్నెస్తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. తర్వాత ఈ భామ వరుస చిత్రాలతో అలరించింది.
దేవదాస్, గోత గోవిందం, యజమన, డియర్ కామ్రేడ్, భీష్మ, పొగరు, సుల్తాన్, పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు, సీతారామం, వారసుడు, మిషజ్ మజ్ను, యానిమల్, పుష్ప ది రూల్, ఛావా సికందర్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన వ్యక్తిగత, వృత్తిపర విషయాలు కూడా అభిమానులతో పంచుకుంటుందన్న విషయం తెలిసిందే.
అయితే తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న సోషల్ మీడియా వేదిక అయిన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో.. ‘‘ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తనను తాను రక్షించుకోవడానికి ఒక దేశం హక్కును యుద్ధ దాహంగా తప్పుగా అర్థం చేసుకోకూడదు. బలమైన ప్రతిస్పందనకు మద్దతు ఇచ్చే వారు యుద్ధోన్మాదులు కాదు.. భద్రత, న్యాయానికి విలువనిచ్చే పౌరులు. రెచ్చగొట్టబడని దూకుడు, అవసరమైన రక్షణ మధ్య లోతైన నైతిక వ్యత్యాసం ఉంది.
ఉద్దేశపూర్వక ఉగ్రవాద చర్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయినప్పుడు, కొలిచిన ప్రతిస్పందన బాధ్యతగా మారుతుంది, ఎంపిక కాదు. శాంతిని కోరడం అంటే హానిని మౌనంగా స్వీకరించడం కాదు. ప్రతీకారం తీర్చుకునే దేశాన్ని ప్రశ్నించవద్దు. సరిహద్దులు దాటి భీభత్సాన్ని పంపే వారిని ప్రశ్నించండి’’. అంటూ రాసుకొచ్చింది.