పదిహేనేళ్లుగా కడుపులో మసులుతున్న కథ ఇది.. ‘రాజు వెడ్స్ రాంబాయి’ యదార్థ కథను చూసిన వ్యక్తి..

by Sujitha Rachapalli |   (  Updated:2025-11-22 05:58:14  IST  )

‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాపై హైప్ పెరుగుతోంది. యదార్థ గాధ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచే పాజిటివ్ టాక్ రాగా

పదిహేనేళ్లుగా కడుపులో మసులుతున్న కథ ఇది.. ‘రాజు వెడ్స్ రాంబాయి’ యదార్థ కథను చూసిన వ్యక్తి..
X

దిశ, వెబ్ డెస్క్ : ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాపై హైప్ పెరుగుతోంది. యదార్థ గాధ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచే పాజిటివ్ టాక్ రాగా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ చేసిన కామెంట్స్ కూడా మూవీ ప్రమోషన్‌కు మరింత హైప్ యాడ్ చేసింది. అయితే ఈ యదార్థ గాధను చూసిన గ్రామానికి చెందిన వ్యక్తి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ‘పదిహేనేళ్ల సంధి మా కడుపులో మసులుతున్న కథ ఇది.. ఇసోంటి బాధ పగోని పిల్లలకు కూడా రావొద్దు..’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఒక నిజం చెప్పాలనుకున్నా కని.. ముఖం దాచుకున్నా.. నాకు సిగ్గు అయితంది అని ఏడ్చేశాడు.

Next Story