డార్లింగ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ప్రభాస్‌తో సుకుమార్..

by Sujitha Rachapalli |

రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాజాసాబ్’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ గ్రిప్పింగ్ అండ్ కామిక్ టైమింగ్‌తో ఆడియన్స్‌కు కితకితలు పెట్టగా.. థియేటర్స్‌లో నవ్వుల సునామీ

డార్లింగ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ప్రభాస్‌తో సుకుమార్..
X

దిశ, వెబ్ డెస్క్ : రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాజాసాబ్’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ గ్రిప్పింగ్ అండ్ కామిక్ టైమింగ్‌తో ఆడియన్స్‌కు కితకితలు పెట్టగా.. థియేటర్స్‌లో నవ్వుల సునామీ సృష్టించేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ చేయనుండగా.. ఆ తర్వాత ‘ప్రశాంత్ వర్మ’తో చిత్రంపై చర్చలు జరుగుతున్నట్లు టాక్. అయితే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఖుష్ అయ్యేలా చేస్తుంది.

ప్రభాస్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మూవీ తెరపైకి రాబోతుందని.. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తాడనిక.. మాసివ్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టబోతున్నారని.. ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే సుకుమార్ - రామ్ చరణ్‌తో సినిమా పూర్తి చేయాల్సి ఉండగా.. ఇటు ప్రభాస్ కల్కి, సలార్ సీక్వెల్స్ కూడా ఉన్నాయి. మరీ ఈ కాంబో సెట్ అయ్యేందుకు ఎన్ని ఇయర్స్ పడుతుందో చూడాలి. కాగా ‘ఆర్య 2’ నుంచి ఈ కాంబో కోసం వెయిట్ చేస్తున్నామని త్వరగా దింపాలని సూచిస్తున్నారు ఫ్యాన్స్.

Next Story