- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పెద్ది’ విడుదలపై టెన్షన్.. చిరంజీవితో ఎగ్జిబిటర్ల కీలక భేటీ
రామ్ చరణ్ హీరోగా.. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో భారీ బడ్జెట్ తెరకెక్కించిన పెద్ది సినిమా మరో 10 రోజుల్లో విడుదలకు సిద్ధమైంది.

దిశ, వెబ్డెస్క్: రామ్ చరణ్ హీరోగా.. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో భారీ బడ్జెట్ తెరకెక్కించిన పెద్ది సినిమా మరో 10 రోజుల్లో విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్లను చిత్రబృందం వేగవంతం చేయగా.. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే తెలంగాణ సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఇకపై సినిమాల విడుదలల్లో తమకు పర్సంటేజిని ఇవ్వాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. పెద్ది సినిమా నుంచే దానిని అమలు చేయాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. ఈ సినిమా తర్వాత పెద్ద సినిమాలేవీ లేవని, పెద్ది నుంచి పర్సంటేజీ విధానాన్ని అమలు చేస్తే.. తాము కూడా నష్టపోకుండా ఉంటామని ఎగ్జిబిటర్లు చెప్తున్నారు. పర్సంటేజి ఇవ్వకుంటే పెద్ది సినిమా విడుదల కానివ్వమని ఇటీవలే ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ విషయంపై చర్చించేందుకు మెగాస్టార్ చిరంజీవితో తెలంగాణ ఎగ్జిబిటర్ల బృందం సమావేశమయింది. పర్సంటేజి విధానంలోనే పెద్ది సినిమాను విడుదల చేయాలని చిరంజీవితో చర్చిస్తున్నారు. అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్లు, రెంటల్ విధానంలో తాము చూస్తున్న నష్టాలను గురించి కూడా అసోసియేషన్ చిరంజీవికి వివరించనుంది. ఈ సమావేశానికి ఫిలిం చాంబర్ అధ్యక్షుడు సురేష్ బాబు, కేఎల్ నారాయణ, నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. సమావేశం తర్వాత చిరంజీవి ఏ నిర్ణయం తీసుకుంటారో, పెద్ది విడుదలకు ఎగ్జిబిటర్లు గ్రీన్ సిగ్నలిస్తారో లేదో చూడాలి.






