నాకు పదేళ్ల వయసులోనే మా అమ్మ చనిపోయింది.. నాన్న పట్టించుకోలేదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న నటి కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-08-26 18:13:04  IST  )

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’(seethamma Vakitlo Sirimalle Chettu) సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తేజస్వి మదివాడ(Tejaswi Madivada) మనందరికీ సుపరిచితమే.

నాకు పదేళ్ల వయసులోనే మా అమ్మ చనిపోయింది.. నాన్న పట్టించుకోలేదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న నటి కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’(seethamma Vakitlo Sirimalle Chettu) సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తేజస్వి మదివాడ(Tejaswi Madivada) మనందరికీ సుపరిచితమే. ఆ తర్వాత ‘మనం’(Manam), ‘హార్ట్ ఎటాక్’(Heart Attack) వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) దర్శకత్వంలో వచ్చిన ‘ఐస్‌క్రీం’(Ice Cream) చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత బిగ్ బాస్(Bigg Boss) హౌజ్‌లో అడుగు పెట్టి బుల్లితెర ఆడియెన్స్‌కు చేరువైంది.

ప్రస్తుతం ఈ భామ టీవీ షోలతో బిజీబిజీగా ఉంటోంది. అలాగే సోషల్ మీడియా(Socail Media)లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ క్రేజీ ఫొటోస్, వీడియోలను షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్‌లో ఉంటోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న తేజస్వి మదివాడ ఎమోషనల్ అయ్యింది. చిన్న తనంలోనే తల్లి చనిపోయిందని చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్ర‌స్తుతం తేజస్వి కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ అనే టీవీ షోలో చేస్తుంది. ఈ షోలో ఫ్యామిలీ థీమ్ ఎపిసోడ్ షూట్ చేశారు. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

అందులో “నాకు పదేళ్ల వయసులోనే మా అమ్మ చనిపోయారు. మా నాన్న మమ్మల్ని పట్టించుకోలేదు. దాంతో నేను 18 ఏళ్ళప్పుడు ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. ఆ తర్వాత రోహిత్ భరద్వాజ్ ఫ్యామిలీ నన్ను చూసుకుంటుంది. నేను ఎప్పుడూ జనాల్లో ఉండటానికి ఇష్టపడతాను. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవుతుంటా.. షూటింగ్ సెట్‌కు వస్తే నాకు ఓ పండగలా ఉంటుంది” అని కన్నీళ్లు పెట్టుకుంది తేజస్వి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Click For Video..

Next Story