- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'వంద దేవుళ్లు' డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ
by Pulgam srinivas |
'శ్రీ శ్రీ' చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ హక్కులను ప్రముఖ సంగీత సంస్థ సరిగమ సొంతం చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: దుల్కర్ సల్మాన్ - పూజా హెగ్డే జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'శ్రీ శ్రీ'. రవి నేలకుదిటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టైటిల్ అనౌన్స్మెంట్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే లుక్కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ హక్కులు అమ్ముడుపోయాయి. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 'శ్రీ శ్రీ' మ్యూజిక్ హక్కులను ప్రముఖ సంగీత సంస్థ సరిగమ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, దీక్షిత్ శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Next Story






