ఫస్ట్ రెయిన్ బో అంటూ పిల్లల ఫొటోస్ షేర్ చేసిన లేడీ సూపర్ స్టార్.. పోస్ట్ వైరల్

by I. Sairam |   (  Updated:2025-04-30 03:56:46  IST  )

‘లక్ష్మి’(Lakshmi) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోయిన్ నయనతార(Nayanathara) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

ఫస్ట్ రెయిన్ బో అంటూ పిల్లల ఫొటోస్ షేర్ చేసిన లేడీ సూపర్ స్టార్.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘లక్ష్మి’(Lakshmi) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోయిన్ నయనతార(Nayanathara) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి అలరించింది. ఇక ‘జవాన్’(Jawan) మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ లేడీ సూపర్ స్టార్‌గా రాణిస్తుంది.

ఇక ఈ భామ వ్యక్తిగత విషయానికి వస్తే.. డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌(Vignesh Shivan)తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఇక సరోగసి ద్వారా ఇద్దరు బాబులకు తల్లి కూడా అయింది. ప్రస్తుతం భర్త, పిల్లలతో లైష్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా నయనతార తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో తన బాయ్స్ రెయిన్ బోను చూస్తున్న పిక్‌ను షేర్ చేస్తూ.. ‘ఫస్ట్ రెయిన్ బో’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Next Story