‘L2: ఎంపురాన్’ వివాదం.. చేతులెత్తి దండం పెడుతూ మోహన్‌లాల్ ఆసక్తికర పోస్ట్

by Mallepaka Hamsa |

మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్(Mohanlal) నటించిన లేటెస్ట్ మూవీ ‘L2: ఎంపురాన్’(L2: Empuran). ఈ సినిమాకు పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) దర్శకత్వం వహించారు.

‘L2: ఎంపురాన్’ వివాదం.. చేతులెత్తి దండం పెడుతూ మోహన్‌లాల్ ఆసక్తికర పోస్ట్
X

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్(Mohanlal) నటించిన లేటెస్ట్ మూవీ ‘L2: ఎంపురాన్’(L2: Empuran). ఈ సినిమాకు పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) దర్శకత్వం వహించారు. అంతేకాకుండా ఇందులో కీలక పాత్రలో నటించారు. అయితే దీనిని శ్రీ గోకుళమ్ మూవీస్, ఆశీర్వాద్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, లైకా ప్రొడక్షన్స్(Lyca Productions) బ్యానర్లపై ఈ సినిమాను గోకుళం గోపాలం, ఆంటోనీ పెరుంబవూర్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ‘లూసిఫర్‌’కు సీక్వెల్‌గా వచ్చింది. అయితే మార్చి 27న థియేటర్స్‌లోకి వచ్చిన ‘L2: ఎంపురాన్’మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అలాగే భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసు వద్ద పలు రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా విడుదలై వారం కూడా కాకముందే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. అదే విధంగా ‘ఎంపురాన్-2’ మూవీపై పలు విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ చిత్రం విషయంలో పృథ్వీరాజ్ సుకుమారన్‌కు ఆధారం పన్ను శాఖ నుంచి నోటీసులు కూడా జారీ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

అయితే ఇప్పటికే ఈ వివాదంపై మోహన్‌లాల్ స్పందించి క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.. తాజాగా, మోహన్‌లాల్ ట్విట్టర్ ద్వారా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెడుతూ షాకింగ్ ఫొటో షేర్ చేశారు. ‘L2: ఎంపురాన్’ ఇప్పుడు మలయాళ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రాజ్యమేలుతోంది. కొత్త పరిశ్రమ బెంచ్‌మార్క్. ఈ క్షణం మాకు మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరి ఆనందానికి కారణం అవుతుంది. మీకు సమీపంలోని థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది’’ అని రాసుకొచ్చారు. అలాగే చేతులెత్తి దండం పెడుతున్న ఫొటోను షేర్ చేశాడు. అయితే మోహన్‌లాల్ ఆ పిక్‌ను ‘ఎంపురాన్’ వివాదం వదిలేయాలనే పెట్టాడని అంతా చర్చించుకుంటున్నారు. మరికొందరు మాత్రం ఈ సినిమా మలయాళ ఇండస్ట్రీలోనే ‘ఎంపురాన్’ అత్యధిక వసూళ్లు సాధించడం గురించి తెలుసుకుని షాక్ అవుతున్నారు.

Next Story