- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మన సినిమాలను చంపేస్తూ.. హాలీవుడ్ బెస్ట్ అంటున్నారు.. అనురాగ్ కశ్యప్ ఘాటు వ్యాఖ్యలు
బెంగళూరులో మెయిన్ వాపస్ ఆవుంగా, గవర్నర్ వంటి సినిమాలకు కేవలం ఒక్క మార్నింగ్ షో మాత్రమే ఇస్తూ, హాలీవుడ్ మూవీ బెస్ట్ అంటూ రోజుకు 6 నుండి 7 షోలు కేటాయించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సినిమాల కంటే ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలతోనే నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఇండస్ట్రీలో చోటుచేసుకునే విషయాలపై తనదైన శైలిలో రియాక్ట్ అవుతూ.. అందరినీ ఆలోచింపజేస్తుంటారు. తాజాగా, అనురాగ్ కశ్యప్ థియేటర్ల యాజమాన్యాలపై మండిపడ్డారు. హాలీవుడ్ హిట్ చిత్రం ‘అబ్సెషన్’ కే ఎక్కువ షోలు ఇస్తూ బెస్ట్ అన్నట్లు వ్యవహరిస్తూ, మన లోకల్ సినిమాలు మెయిన్ వాపస్ ఆవుంగా, గవర్నర్, హాంటెడ్ 3D, 'బందర్’ వంటి వాటిని చంపేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తూ.. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘‘అబ్సెషన్' సినిమాను అందరూ చూడాలనుకోవడంలో తప్పు లేదని, కానీ దానికి తక్కువ షోలు ఇచ్చినా ఎక్కువ రోజులు ఆడుతుందని ఆయన అన్నారు. మన సొంత చిత్రాలకు మంచి షో టైమింగ్స్ ఇచ్చి ఆదరించకపోతే, భారతీయ సినిమా ఎలా ఎదుగుతుందని ప్రశ్నించారు.
బెంగళూరులో మెయిన్ వాపస్ ఆవుంగా, గవర్నర్ వంటి సినిమాలకు కేవలం ఒక్క మార్నింగ్ షో మాత్రమే ఇస్తూ చంపేస్తున్నారని, కానీ హాలీవుడ్ మూవీని మాత్రం బెస్ట్ అంటూ రోజుకు 6 నుండి 7 షోలు కేటాయించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తెలుగు సినిమా ‘సింగ్ గీతం’కు బెంగళూరులో మొత్తానికి ఒక్క షో కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు.అంతేకాకుండా కలెక్షన్లు రివీల్ చేస్తూ.. థియేటర్స్ వద్ద మన చిత్రాలు పడుతున్న ఇబ్బందిని వివరించారు. ఒక నటుడు-మ్యూజీషియన్ జీవితం చుట్టూ తిరిగే కథతో నా దర్శకత్వంలో వచ్చిన 'బందర్' చిత్రం గత వారం రూ.4 కోట్ల వరకు వసూలు చేసింది. మరోవైపు, ఒక అబ్బాయి తన క్రష్ గురించి కోరుకున్న కోరిక ఎలాంటి భయానక మలుపులు తీసుకుందనే కథతో వచ్చిన హాలీవుడ్ హారర్ చిత్రం ‘అబ్సెషన్’ ఇండియాలోనే రూ.60 కోట్లకు పైగా వసూలు చేసి భారీ హిట్గా నిలిచిందని అన్నారు. ఇక ఈ హాలీవుడ్ క్రేజ్ వల్ల స్థానిక సినిమాలు థియేటర్ల దొరక్క ఇబ్బంది పడుతున్నాయని అనురాగ్ కశ్యప్ పేర్కొన్నారు.






