- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మలయాళ ఇండస్ట్రీకి కరణ్ జోహార్ ఎంట్రీ.. గర్వంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్
ఈ తరం సినిమాలో జానపద కథలను ఎంతో భయంకరంగా, ఆసక్తికరంగా తెరకెక్కించడంలో దర్శకుడు రాహుల్ సదాశివన్కు ఒక ప్రత్యేకమైన శైలి ఉందని కరణ్ జోహార్ ప్రశంసించారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్కు చెందిన పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ కలిసి ఒక భారీ మలయాళ చిత్రాన్ని ప్రకటించాయి. 19వ శతాబ్దపు కేరళ జానపద కథలు, సాంస్కృతిక గాథల ఆధారంగా ‘ఓడియన్: ది ఏజ్ ఆఫ్ ఇల్యూజన్’ పేరుతో రాబోతుంది. తాజాగా, ఈ ప్రాజెక్ట్ గురించి కరణ్ జోహీర్ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తాము ధర్మ ప్రొడక్షన్స్ తరపున మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నందుకు చాలా గర్వంగా ఉందని తెలిపారు. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్తో తమకు ఇప్పటికే ఎన్నో విజయవంతమైన కొల్లాబరేషన్స్ ఉన్నాయని, భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్ట్స్ చేయబోతున్నామని చెప్పారు. ఈ తరం సినిమాలో జానపద కథలను ఎంతో భయంకరంగా, ఆసక్తికరంగా తెరకెక్కించడంలో దర్శకుడు రాహుల్ సదాశివన్కు ఒక ప్రత్యేకమైన శైలి ఉందని కరణ్ జోహార్ ప్రశంసించారు.
ఈ బలమైన జానపద ఇతిహాసాన్ని వెండితెరపై ఆవిష్కరించడానికి అద్భుతమైన నటి మంజు వారియర్, తమకు ఎంతో ఇష్టమైన పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని, ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఆయన వెల్లడించారు. అయితే ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న మొట్టమొదటి మలయాళ చిత్రం ఇదే కావడం విశేషం. కేరళ పురాణాల్లోని రూపం మార్చుకునే ఓ మాయా శక్తి, ఒక బలమైన మాతృస్వామ్య కుటుంబంపై విరుచుకుపడటం.. ఆ తర్వాత సత్యం, భ్రమల మధ్య జరిగే భీకర పోరాటం చుట్టూ ఈ కథ సాగనుందని టాక్. కేరళ జానపద కథలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించే దర్శకుడు రాహుల్ సదాశివన్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా.. మంజు వారియర్,పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం కానుందని సమాచారం.






