ప్రభాస్ కారణంగా ప్రతి రోజు ఏడ్చేదాన్ని.. నరకం అనుభవించాను.. స్టార్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-07-06 04:05:18  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్(Nithya Menon) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

ప్రభాస్ కారణంగా ప్రతి రోజు ఏడ్చేదాన్ని.. నరకం అనుభవించాను.. స్టార్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్(Nithya Menon) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘అలా మొదలైంది’(Ala Modalaindi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన ఫస్ట్ చిత్రంతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. మరోపక్క సింగర్‌గా కూడా పలు ఫీల్ గుడ్ సాంగ్స్‌ను పాడింది. ప్రస్తుతం తమిళం, మలయాళం భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిన్నది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఆమె మాట్లాడుతూ.. ‘“నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తెలుగు సినిమాలు అంతగా చూడలేదు. అప్పుడు నాకు తెలుగు సరిగ్గా రాకపోవడంతో సినిమాలు చూడలేదు. కానీ కెరీర్ మొదట్లో ప్రభాస్ గురించి నన్ను అడిగారు. నాకు తెలియదు అని చెప్పాను. దీంతో నేనేదో తప్పు చేసినట్లుగా చూశారు. నాపై విమర్శలు చేశారు. ఆ విమర్శలపై నేను చాలా హర్ట్ అయ్యాను. అలాగే నాపై ట్రోల్స్ కూడా చేశారు. అవి చూసి నేను ప్రతి రోజు ఏడ్చేదాన్ని. అలా కొన్ని రోజులు నరకం అనుభవించాను. అయితే ఆ ఇష్యూతో నిజాయితీగా అన్ని చోట్లు ఉండకూడదని .. ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలని తెలిసింది. ఇప్పటికీ ఆ ఇష్యూ నన్ను ఎంతగానో బాధపెడుతుంది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story