పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు ఒక గుడ్ న్యూస్.. ఒక బ్యాడ్ న్యూస్

by Gantepaka Srikanth |   ( Updated:2025-04-18 12:42:27.0  )
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు ఒక గుడ్ న్యూస్.. ఒక బ్యాడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. ఏఎం రత్నం నిర్మిస్తున్న హరిహర వీరమల్లు(Harihara Veeramallu), సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఓజీ(OG), హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh)లు ఉన్నాయి. అయితే.. ఏఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హరిహర వీరమల్లు చిత్రాన్ని నాలుగేళ్ల క్రితమే ప్రారంభించారు. కొవిడ్ నుంచి పోస్ట్‌పోన్ అవుతూనే ఉంది. తాజాగా వచ్చే మే 9వ తేదీన విడుదలకు రంగం సిద్ధమైందని.. ఎలాంటి వాయిదాలు ఉండబోవని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించినా.. సాధ్యం అయ్యే పరిస్థితులు కనిపించడం లేదని సినీ వర్గాలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌కు సంబంధించిన కొన్ని సీన్లు ఇంకా అలాగే పెండింగ్‌లో ఉన్నాయని.. ఆయన మరో వారం పాటు టైమిస్తే పూర్తవుతుందని సమాచారం. ఈ క్రమంలోనే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వచ్చే నాలుగైదు రోజుల్లో పవన్ కల్యాణ్(Pawan Kalyan) షూటింగ్‌లో పాల్గొంటారని.. ఏకంగా 10 రోజుల పాటు టైమిచ్చారని.. తన పార్ట్‌ మొత్త పూర్తి చేశాకే బయటకు వస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మే థర్డ్ వీక్ లేదా? ఫోర్త్ వీక్‌లో విడుదలకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక బ్యాడ్ న్యూస్ విషయానికి వస్తే.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం ఓజీ. ఇప్పటికే 70శాతం వరకు షూటింగ్ పూర్తి కాగా, పవన్ టైమిస్తే ఆ కాస్త కూడా ఫినిష్ చేసి ఈ ఏడాదే విడుదల చేయాలని ఓజీ చిత్రబృందం ప్లాన్ చేసింది. అయితే.. హరిహర వీరమళ్లు పూర్తయిన తర్వాత ఓజీ షూటింగ్ పూర్తి చేయడానికి కనీసం రెండు, మూడు నెలల సమయం పడుతుందని.. ఈ నేపథ్యంలోనే ఏడాది విడుదల ఉన్నట్లు కనిపించడం లేదని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సంగతి హరీష్ శంకర్‌కు, ఆ దేవుడికే తెలియాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు..

Click For Tweet Post..



Next Story

Most Viewed