- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Pawan Kalyan: పవర్ స్టార్ అభిమానులకు డబుల్ గుడ్ న్యూస్.. అసలు విషయం తెలిస్తే ఎగిరి గంతేయాల్సిందే!

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గత ఏడాది జరిగిన ఎన్నికల్లో గెలవడంతో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఎన్నికలకు ముందు ఒప్పుకున్న సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉండటంతో.. హరిహర వీరమల్లు(Harihara Veeramallu), ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh) వంటి షూటింగ్స్కు బ్రేక్ పడింది. ఈక్రమంలోనే ఆయన ఇండస్ట్రీకి దూరం కానున్నారనే వార్తలు రావడంతో అభిమానులు కంగారు పడిపోయారు. ఇక ఇటీవల ఆయన స్పందించి మళ్లీ షూటింగ్స్లో పాల్గొంటానని ఈ విషయం నిర్మాతలకు కూడా చెప్పానని అనడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మూడు సినిమాల నుంచి అప్డేట్స్ వచ్చినప్పటికీ రిలీజ్ డేట్పై అయోమయం నెలకొంది.
దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఈక్రమంలో.. తాజాగా, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎగిరి గంతేసే పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘తన సినిమా షెడ్యూల్ను ఖరారు చేసేందుకు పవన్ కళ్యాణ్ తన నిర్మాతలతో సమావేశమైనట్లు సమాచారం. అయితే ఆయన ముందుగా హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేయబోతున్నారట. ఆ తర్వాత త్వరగా OGని ముగించి, జూలైలో UstaadBhagatSingh షూటింగ్ ప్రారంభిస్తాడని టాక్. అంతా సవ్యంగా జరిగితే సెప్టెంబర్ 5న ‘TheyCallHimOG’ సినిమాను విడుదల చేసే ప్లాన్లో ఉన్నారట. ఈ విషయం తెలుసుకున్న పవన్ అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.
#PawanKalyan met with his producers to finalize his film schedule. He’ll first complete #HariHaraVeeraMallu, which requires only a few more days, then quickly wrap up #OG, and begin shooting #UstaadBhagatSingh in July.
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) April 23, 2025
If everything goes well #TheyCallHimOG on Sept 5th.