- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డు: రూ.3 వేల కోట్లు కొల్లగొట్టిన 'ధురందర్' ఫ్రాంచైజీ
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఏ సినిమా ఫ్రాంచైజీకి సాధ్యం కాని అరుదైన మైలురాయిని 'ధురందర్' సిరీస్ అధిగమించింది.

దిశ, వెబ్డెస్క్: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఏ సినిమా ఫ్రాంచైజీకి సాధ్యం కాని అరుదైన మైలురాయిని 'ధురందర్' సిరీస్ అధిగమించింది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన ఈ స్పై థ్రిల్లర్ సిరీస్ రెండు భాగాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.3000 కోట్ల వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. తాజా నివేదికల ప్రకారం, ఈ ఫ్రాంచైజీలోని రెండు చిత్రాల ఉమ్మడి వసూళ్లు రూ.3,019 కోట్లకు చేరాయి. భారతీయ సినిమా చరిత్రలో ఒకే ఫ్రాంచైజీకి చెందిన సినిమాలు ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం ఇదే మొదటిసారి. ధురందర్ (మొదటి భాగం) 2025 డిసెంబరులో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 1,307 కోట్లు వసూలు చేసింది. ధురందర్ ది రివెంజ్ (రెండవ భాగం) 2026 మార్చిలో విడుదలైన ఈ చిత్రం కేవలం 26 రోజుల్లోనే రూ. 1,712 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
బాహుబలి, పుష్ప రికార్డులు కనుమరుగు...
ఈ భారీ వసూళ్లతో 'ధురందర్' ఫ్రాంచైజీ.. గతంలో రికార్డులు సృష్టించిన 'బాహుబలి' (రెండు భాగాలు కలిపి రూ. 2,438 కోట్లు), 'పుష్ప' (రెండు భాగాలు కలిపి రూ. 2,092 కోట్లు) వంటి చిత్రాల రికార్డులను అధిగమించింది. ముఖ్యంగా రెండవ భాగం 'ధురందర్: ది రివెంజ్' భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ. 1,000 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన మొదటి హిందీ చిత్రంగా నిలిచింది. చైనా, గల్ఫ్ వంటి ప్రధాన విదేశీ మార్కెట్లలో విడుదల కాకుండానే ఈ స్థాయి వసూళ్లు రావడం ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ చిత్రంలో రణవీర్ సింగ్తో పాటు సంజయ్ దత్, ఆర్.మాధవన్, అక్షయ్ ఖన్నా వంటి భారీ తారాగణం నటించారు. జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ ఈ భారీ ప్రాజెక్టును నిర్మించాయి. ఈ ఘనతతో రణవీర్ సింగ్ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ను తన ఖాతాలో వేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఈ సిరీస్ మరిన్ని రికార్డులను తిరగరాస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.






