48 గంటలు వేచి ఉండండి.. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ టీజర్ రాబోతున్నది

by Chukka Sudharani |

మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘దృశ్యం-3’ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని మే 21న థియేటర్స్‌లోకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నది.

48 గంటలు వేచి ఉండండి..  ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ టీజర్ రాబోతున్నది
X

దిశ, సినిమా: భారతీయ చలనచిత్ర రంగంలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘దృశ్యం’ చిత్రానికి ఉన్న ప్రజాదారణ అందరికి తెలిసిందే. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే వచ్చిన రెండు భాగాలు ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ఇప్పుడు మూడో భాగం సిద్ధం అయింది. మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘దృశ్యం-3’ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని మే 21న థియేటర్స్‌లోకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఇందులో భాంగంగానే తాజాగా టీజర్ అప్డేట్ ఇచ్చారు మోహన్ లాల్. ‘దృశ్యం 3 అధికారిక టీజర్ ఈ బుధవారం, ఏప్రిల్ 29న, సాయంత్రం 5 గంటలకు విడుదల అవుతుంది. వేచి ఉండండి’ అంటూ చెప్పుకొచ్చాడు.

Next Story