‘భైరవం’ థర్డ్ సింగిల్ అప్డేట్.. మాస్ స్టెప్‌ వేస్తున్న పోస్టర్‌తో హైప్ పెంచిన మేకర్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-11 12:10:12  IST  )

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Sai Srinivas), మంచు మనోజ్, నారా రోహిత్(Nara Rohit) కాంబోలో రాబోతున్న మల్టీ స్టారర్ మూవీ ‘భైరవం’(Bhairavam).

‘భైరవం’ థర్డ్ సింగిల్ అప్డేట్.. మాస్ స్టెప్‌ వేస్తున్న  పోస్టర్‌తో హైప్ పెంచిన మేకర్స్
X

దిశ, సినిమా: యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Sai Srinivas), మంచు మనోజ్, నారా రోహిత్(Nara Rohit) కాంబోలో రాబోతున్న మల్టీ స్టారర్ మూవీ ‘భైరవం’(Bhairavam). విజయ్ కనకమేడల దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను శ్రీసత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. అయితే ఇందులో నటి ప్రియమణి, జయసుధ కీలక పాత్రలో నటిస్తుండగా.. దివ్య పిళ్లై, అదితి శంకర్(Aditi Shankar), ఆనంది హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఇందులోంచి విడుదలైన అప్డేట్స్ అన్ని చిత్రంపై అంచనాలను పెంచేశాయి. ‘భైరవం’ సినిమా మే 30న వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతున్నట్లు వెల్లడించారు. ఇక రిలీజ్ తేదీ దగ్గరపడుతుండటంతో మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో జోష్ నింపుతున్నారు. తాజాగా, చిత్రబృందం ‘భైరవం’ థర్డ్ సింగిల్ రాబోతున్నట్లు ప్రకటించారు. డుమ్ డుమారే సాంగ్ లాంచ్ రేపు (మే 11న)హైదరాబాద్‌లోని ఆర్‌కే కాంప్లెక్స్‌లో ఉదయం 10గంటలకు జరగబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మనోజ్, రోహిత్, శ్రీనివాస్ ఫుల్ జోష్‌లో మాస్ స్టెప్స్ వేస్తున్న పోస్టర్‌ను షేర్ చేశారు. అంతేకాకుండా ఎక్కువ సంఖ్యగల సోదర భావం చూడబోతున్నారు తెలిపారు. అంటే ఇది అన్నదమ్ములకు సంబంధించిన పాట అని తెలుస్తోంది.

Next Story