ఆ రోజు పవన్ అన్న మాటకి ఒక్కసారిగా సైలెంట్ అయ్యాను.. బండ్ల గణేష్

by Pulgam srinivas |

బండ్ల గణేష్ మాట్లాడుతూ... నేను 'గబ్బర్ సింగ్'లో శృతిహాసన్ హీరోయిన్గా వద్దన్నాను.. పవన్ మాత్రం ఆ విషయాన్ని చెప్పి తీసుకుందాం అన్నారు.

ఆ రోజు పవన్ అన్న మాటకి ఒక్కసారిగా సైలెంట్ అయ్యాను.. బండ్ల గణేష్
X

దిశ, వెబ్ డెస్క్ : నటుడు మరియు నిర్మాత అయిన బండ్ల గణేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నటుడిగా చాలా సంవత్సరాల పాటు కెరీర్ను కొనసాగించిన ఈయన, రవితేజ హీరోగా రూపొందిన ఆంజనేయులు చిత్రంతో నిర్మాతగా కెరీర్ను ప్రారంభించాడు. ఈ నిర్మాత తన కెరీర్లో పవన్ కళ్యాణ్ హీరోగా రెండు సినిమాలను రూపొందించాడు. వీరి కాంబోలో మొదటగా తీన్‌మార్ సినిమా వచ్చింది. ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. ఆ తర్వాత గబ్బర్ సింగ్ వచ్చింది. ఇది మాత్రం భారీ సక్సెస్ను సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా, బండ్ల గణేష్ కి నిర్మాతగా మంచి గుర్తింపును తీసుకువచ్చింది.

కొంతకాలం క్రితం ఈ నటుడు మరియు నిర్మాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, గబ్బర్ సింగ్ సినిమా స్టార్ట్ కాకముందు జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలియజేశాడు. బండ్ల గణేష్ మాట్లాడుతూ... పవన్ గారితో రూపొందించిన తీన్‌మార్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత పిలిచి మళ్ళీ ఆయన నాకు రెండవ అవకాశం ఇచ్చాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో దబాంగ్ రీమేక్ చేయడానికి కమిట్ అయ్యాం. ఇక పవన్ పక్కన హీరోయిన్గా భారీ క్రేజ్ ఉన్న అమ్మాయిని తీసుకోవాలని నేను అనుకున్నాను.

అదే సమయంలో శృతిహాసన్ను హీరోయిన్గా తీసుకోవాలని దర్శకుడు అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఓకే అన్నారు. నేను ఆ టైంలో పవన్ గారితో "సార్ ఆ అమ్మాయికి ఇప్పటివరకు హిట్ లేదు. అలాంటి వారితో మనకెందుకు, ఒక మంచి సక్సెస్ ఉన్న అమ్మాయిని తెచ్చుకుందాం" అన్నాను. దానితో పవన్... "నీకు ఇప్పటివరకు ఒక హిట్ అయినా ఉందా? సైలెంట్గా అలాంటి సెంటిమెంట్స్ పట్టించుకోకుండా వెళ్ళిపోదాం" అన్నారు. వెంటనే నేను సైలెంట్ అయ్యాను. ఆ తర్వాత ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసి సినిమాను పూర్తి చేశాం, ఆ చిత్రం బ్లాక్బాస్టర్ అయింది అని ఆయన చెప్పుకొచ్చాడు.

Next Story