- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయానికి బాలకృష్ణ

దిశ, వెబ్ డెస్క్: సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయంలో సందడి చేశారు. బాలయ్య కొత్త రేంజ్ రోవర్ కారు కొనుగోలు చేశారు. ఆ కారు నంబర్ TG09F0001 రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులతో బాలయ్య సరదాగా ముచ్చటించారు. అందరూ బాగున్నారా అంటూ అధికారులను మందలించారు. మోడీ అమరావతి పర్యటనకు తాను వెళుతున్నట్టు తెలిపారు.
ఇక బాలయ్యకు ఇటీవలే కేంద్రం పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. సినిమా రంగంలో బాలయ్య చేసిన కృషికి గానూ ఈ అవార్డు దక్కింది. ప్రస్తుతం ఆయన సీనియర్ హీరో అయినప్పటికీ కుర్ర హీరోలతో సైతం పోటీ పడుతున్నారు. ప్రస్తుతం వరుసగా నాలుగు హిట్లను తన ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ లో ఉన్నారు. హీరోగానే కాకుండా అన్ స్టాపబుల్ షో ద్వారా ఆయన ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. మరోవైపు రాజకీయాల్లోనూ బాలయ్య చురుగ్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.