- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
‘అక్కడ జీవితాన్ని మధురంగా గడుపుతున్నాను’ అంటూ హీరోయిన్ పోస్ట్.. ప్రతి ఒక మూమెంట్ పిక్స్ పంచుకున్న నటి

దిశ, వెబ్డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే లైగర్ సినిమాతో టాలీవుడ్ సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. విజయ్ దేవరకొడ సరసన నటించి.. ఈ బ్యూటీ మంచి మార్కులే కొట్టేసింది. కానీ ఈ మూవీ ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. తర్వాత ఈ బ్యూటీ రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీ, స్టూడెట్ ఆఫ్ ది ఇయర్ 2, పతి పత్నీ ఔర్ వో, ఖాలీ పీలీ, గెహ్రైయాన్, డ్రీమ్ గర్ల్ 2, ఖో గయే హమ్ కహాన్, బాడ్ న్యూజ్, ఖేల్ ఖేల్ మే, సీటీఆర్ఎల్ వంటి తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి జనాల మెప్పు పొందింది.
అనన్య పాండే బాలీవుడ్లో నటించిన కంట్రోల్ అనే సైబర్ థ్రిల్లర్ సినిమా తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయిన విషయం తెలిసిందే. సైబర్ థ్రిల్లర్ డిఫరెంట్ పాయింట్తో తెరకెక్కించిన ఈ మూవీ ఏకంగా సినిమా నాలుగు భాషల్లో విడుదల చేశారు. నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ జనాల్లో భారీ హైప్ పెంచిందని చెప్పుకోవచ్చు. ప్యూచర్లో ఏఐ టెక్నాలజీ.. సోషల్ మీడియా.. మనుషుల్ని ఏ లెవల్లో ప్రభావితం చేస్తుందో.. దీన్ని ఎలా కంట్రోల్ పెట్టాలనే స్టోరీనే దర్శకుడు విక్రమాదిత్య ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ఇందులో అనన్య పాండేతో పాటుగా విమాన్ సామ్రాట్ కీలక పాత్రలో నటించారు. ఇదంతా పక్కన పెడితే... అనన్య పాండే తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ..ఏదో ఒక పోస్ట్తో నెటిజన్లను అలరిస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఇటలీ వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ఎంజాయ్ చేసిన పిక్స్ అభిమానులతో పంచుకుని.. ‘‘ఇటాలియన్ జీవితాన్ని మధురంగా గడుపుతున్నాను’’ అంటూ రాసుకొచ్చింది.