Aadi Pinisetty: రాజకీయ ప్రత్యర్థులుగా మారిన ఇద్దరు గొప్ప స్నేహితుల కథ.. ఇంట్రెస్టింగ్‌గా టీజర్

by Chukka Sudharani |

ఆది పినిశెట్టి, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘మయసభ’.

Aadi Pinisetty: రాజకీయ ప్రత్యర్థులుగా మారిన ఇద్దరు గొప్ప స్నేహితుల కథ.. ఇంట్రెస్టింగ్‌గా టీజర్
X

దిశ, సినిమా: ఆది పినిశెట్టి, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘మయసభ’. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సీరిస్‌కు దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సిరీస్ సోనీలివ్ ఒరిజినల్స్‌లో ఆగస్టు 7 నుంచి తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ వెబ్ సిరీస్ నుంచి టీజర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ‘అన్నా.. ఆర్జెంట్‌గా బయలుదేరి హైదరాబాద్ ఆశ్రమం హోటల్‌కు వచ్చేయ్.

పెద్దాయన రేపు పార్టీలో నుంచి సస్పెండ్ చేయబోయే 35 MLAల లిస్ట్‌లో నువ్వు కూడా ఉన్నావు’ అనే వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయిన ఈ టీజర్‌లో.. ‘ఏం జరుగుతోంది నాయుడు.. ప్రతిపక్ష నాయకుడికి ఎందుకు ఫోన్ చేశావు.. ఫ్రెండ్ గానా, ప్రత్యర్థి గానా?’ అని చైతన్య రావు ఆది పినిశెట్టితో ఫోన్ మాట్లాడతాడు. ఆక ఆది.. ‘కురుక్షేత్రం.. ఇది చావో రేవో అర్థం కావడం లేదు రెడ్డి.. 20 ఏళ్ల రాజకీయ జీవితం ఒక మేకప్ ఆర్టిస్ట్ చెప్పు కింద నలిగిపోతుంది అనుకోలేదు.. స్నేహితుడిగా ఒక మాట చెప్పు.. ఈ ఉచ్చు నుంచి బయటపడతానా?’ అంటూ చెప్పిన ఆది డైలాగ్స్ సినిమాపై మరింత ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఇక మంచి స్నేహితులు అయినా ఇద్దరు రాజకీయ ప్రత్యర్థుల చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తుండగా.. టీజర్‌కు నెట్టింట మంచి స్పందన లభిస్తుంది. టీజర్

Next Story