- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Aadi Pinisetty: రాజకీయ ప్రత్యర్థులుగా మారిన ఇద్దరు ప్రాణ స్నేహితులు.. ఆకట్టుకుంటోన్న ట్రైలర్
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ ఈమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు ఆది పినిశెట్టి.

దిశ, సినిమా: వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ ఈమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు ఆది పినిశెట్టి. ‘ఒక ‘వి’ చిత్రం’ అనే సినిమాతో 2006లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. ఎన్నో సినిమాల్లో నటించారు. హీరోగా, విలన్గా.. పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకుంటూ చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో డిఫరెంట్ జోనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు.
ఆది పినిశెట్టి, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘మయసభ’. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ సీరిస్కు దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్నాడు. మంచి స్నేహితులు అయినా ఇద్దరు రాజకీయ ప్రత్యర్థుల చుట్టూ తిరిగే ఈ సిరీస్ సోనీలివ్ ఒరిజినల్స్లో ఆగస్టు 7 నుంచి తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఈ వెబ్ సిరీస్ నుంచి టీజర్ రిలీజ్ చెయ్యగా.. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదే జోష్లో నేడు ట్రైలర్ను గ్రాండ్గా లాంచ్ చేశారు మేకర్స్. యాక్సిడెంట్తో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్ కూడా రాజకీయాల చుట్టూ తిరిగి ప్రేక్షకుల్లో క్యూరియాసిటినీ నిపింది.






