- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Vijay Deverakonda: గొప్ప మనసు చాటుకున్న రౌడీ హీరో.. భారత సైన్యానికి భారీ విరాళం.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు (వీడియో)

దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) గొప్ప మనసు చాటుకున్నాడు. నేడు ఆయన పుట్టినరోజు కావడంతో కీలక ప్రకటన విడుదల చేస్తూ ఓ వీడియోను షేర్ చేశాడు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే పలువురు సినీ సెలబ్రిటీలు వారికి విరాళం ఇస్తున్నారు. తాజాగా, విజయ్ దేవరకొండ కూడా తన బర్త్ డే నాడు మంచి పని చేశారు. తన వంతు బాధ్యతగా విరాళం అందిస్తున్నట్లు వెల్లడించారు.
రాబోయే కొన్ని వారాల పాటు తన రౌడీ వేర్ అమ్మకాల్లో వచ్చే లాభాల్లోని కొంత వాటాను భారతీయ సైన్యానికి విరాళంగా ఇవ్వబోతున్నట్లు తెలిపాడు. మేడ్ ఇన్ ఇండియా మాత్రమే కాకుండా మేడ్ ఫనర్ ఇండియా అని అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అది చూసిన నెటిజన్లు రౌడీ హీరోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే.. ఆయన ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘కింగ్డైమ్’ చేస్తున్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యానర్స్పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు.
ఈ మూవీ భారీ అంచనాల మధ్య మే30న థియేటర్స్లోకి రాబోతుంది. అయితే విజయ్ దేవరకొండ ఈ చిత్రంతో పాటు రాహుల్ సంకృత్యన్(Rahul Sankrityan) దర్శకత్వంలోనూ ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నారు. ‘VD-14’ వర్కింగ్ టైటిల్తో రాబోతున్న ఈ సినిమాను ప్రెస్టీజియస్ బ్యానర్పై మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, రవిశంకర్(Ravi Shankar) భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఒక వీరుడి పోరాటాన్ని చూపిస్తూ 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది.