AP High Court: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీకి బిగ్ షాక్

by Jakkula.Mamatha |

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ (Sankranthiki Vasthunam Movie) పండగ రోజు(జనవరి 14) విడుదలైన విషయం తెలిసిందే

AP High Court: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీకి బిగ్ షాక్
X

దిశ,వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ (Sankranthiki Vasthunam Movie) పండగ రోజు(జనవరి 14) విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీ రిలీజైన 9 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.230 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్లు సాధించిందని చిత్ర బృందం పేర్కొంది. తొలి రోజే ఈ చిత్రం రూ.45 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు చేసి వెంక‌టేష్ కెరీర్‌లో భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన చిత్రంగా నిలిచింది.

అయితే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీకి బిగ్ షాక్ తగిలింది. ఈ చిత్రం పై ఏపీ(Andhra Pradesh) హైకోర్టు(High Court)లో పిల్ దాఖలైంది. ఈ మూవీ బడ్జెట్, వసూళ్ల విషయంలో క్విడ్ ప్రో కో జరిగిందంటూ ఈ పిల్‌లో ఆరోపించారు. ఈ సినిమా అదనపు షోల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. అలాగే.. ఐటీ, ఈడీ, జీఎస్టీ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మూవీ నిర్మాత దిల్ రాజు(Dil Raju) నివాసం, కార్యాలయాల్లో గత నాలుగు రోజులుగా ఐటీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story