- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
లాక్డౌన్ కారణంగా రెండు నెలలుగా సినిమా షూటింగ్స్ ఆగిపోవడంతో సినీ పరిశ్రమకు భారీగా నష్టం వాటిల్లింది. ఎన్నో సినిమాల విడుదల ఆగిపోగా.. మరెన్నో సినిమాలు ఓటీటీ ప్లాట్ఫామ్ వైపు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కేసీఆర్తో పాటు మంత్రి తలసానితో సంప్రదింపులు జరిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర హోమ్ శాఖ మంత్రి కిషన్ రెడ్డి సైతం పలువురు సినీ ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక అంశాలపై చర్చించారు.
షూటింగ్ల కోసం త్వరలోనే అనుమతి లభిస్తుందని, దేశవ్యాప్తంగా థియేటర్లన్నీ ఒకే రోజున ఓపెనింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంటామని కిషన్ రెడ్డి అన్నారు. పైరసీ అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. జమ్ము కశ్మీర్ సహా దేశంలో ఎక్కడైనా సినిమా షూటింగ్లు, స్టూడియోల నిర్మాణం కోసం తాను ఆయా సీఎంలతో మాట్లాడతానని, రీజనల్ జీఎస్టీ గురించి కూడా ఆలోచిద్దామన్నారు. త్వరలోనే తెలుగు, తమిళ, హిందీ సినీ పరిశ్రమ ప్రతినిధులు వస్తే ప్రత్యేక మీటింగ్ పెట్టి సినిమా సమస్యలపై చర్చిద్దామని మంత్రి తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, డైరెక్టర్ తేజ, జెమిని కిరణ్, త్రిపురనేని వరప్రసాద్, దాము కానూరి, వివేక్ కూచిభొట్ల, అనిల్ శుక్లా, అభిషేక్ అగర్వాల్, శరత్, ప్రశాంత్, రవి పలువురు పాల్గొన్నారు.