వైసీపీ ఎమ్మెల్యేకు సీఐడీ నోటీసులు

by  |
వైసీపీ ఎమ్మెల్యేకు సీఐడీ నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద సీఐడీ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. అమరావతికి అసైన్డ్ భూములకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం చెప్పాలని, మీ దగ్గర ఉన్న ఆధారాలు తమకు సమర్పించాలని నోటీసుల్లో పేర్కొంది.

ఇప్పటికే మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 22న నారాయణ హాజరుకావాల్సి ఉండగా.. ఈ నెల 23న చంద్రబాబు హాజరుకావాల్సి ఉంది.



Next Story

Most Viewed