దేవినేని ఉమకు మరోసారి నోటీసులు

by  |
దేవినేని ఉమకు మరోసారి నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పాటు వీడియో మార్ఫింగ్ చేశారనే ఆరోపణలపై మాజీ మంత్రి దేవినేని ఉమకు సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. మే 1న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా నిన్న మంగళగిరి సీఐడీ కార్యాలయంలో ఉమను అధికారులు ప్రశ్నించారు.

కానీ ఆయన ఇచ్చిన సమాధానంతో సీఐడీ అధికారులు సంతృప్తి చెందలేదు. దీంతో విచారణకు హాజరుకావాల్సిందిగా మరోసారి ఇవాళ నోటీసులు జారీ చేశారు.


Next Story

Most Viewed