మూడ్రోజుల్లో విధుల్లోకి.. అంతలోనే మృతి

by  |
మూడ్రోజుల్లో విధుల్లోకి.. అంతలోనే మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో విషాద ఘటన చోటుచేసుకుంది. మూడు నెలల క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన సీఐ రెడ్డి శ్రీనివాసరావు సుదీర్ఘ కాలం విరామం తర్వాత ఈ నెల 8న విధుల్లోకి చేరనున్నాడు. ఈ క్రమంలో శనివారం వడ్డాదిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం చేస్తుండగా సృహ తప్పి పడిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. కాగా మూడ్రోజుల్లో ఆయన విధుల్లో చేరునున్న క్రమంలో… ఇంతలోనే అనంతలోకాలకు వెళ్లడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Next Story

Most Viewed