చిక్కనంటున్న చిరుత..

by  |
చిక్కనంటున్న చిరుత..
X

దిశ, వెబ్‌డెస్క్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ శివారు ప్రాంతంలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. అగ్రికల్చర్ యూనివర్శటీ దగ్గర ఆవుపై చిరుత దాడి చేసింది. చిరుత మళ్లీ తిరిగి రావడంతో శివారు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను పట్టుకునేందుకు ఫారెస్టు అధికారులు ఏర్పాటు చేసిన బోన్లు ఎందుకు పనికి రాకుండా పోయాయి.

అవి ఉన్న చోట్ల కాకుండా ఇతర ప్రాంతాల గుండా చిరుత సంచరిస్తోందని స్థానికులు చెబుతున్నారు. మరల ఫారెస్టు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు అప్రమత్తం అయ్యారు. ఏయే ప్రాంతాల గుండా చిరుత సంచారం ఎక్కువగా ఉందో పరిశీలించి, దానిని పట్టుకునేందుకు వారు చర్యలకు సిద్ధమవుతున్నారు.


Next Story

Most Viewed