‘ఆచార్య’ తర్వాత మెగాస్టార్ చేసే సినిమాలు అవేనా?

by  |
‘ఆచార్య’ తర్వాత మెగాస్టార్ చేసే సినిమాలు అవేనా?
X

దిశ వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’లో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత ‘లూసిఫర్’ రీమేక్‌లో ఆయన నటించనున్నారు. ఈ రీమేక్‌కు సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఆ తర్వాత ఏం ప్రాజెక్టులు చేయబోతున్నారు? ఏ యే దర్శకులు మెగాస్టార్ కు కథలు వినిపించారు?

మెగాస్టార్ చిరంజీవి తన కమ్ బ్యాక్ తర్వాత సామాజిక అంశాలతో ముడిపడిన చిత్రాల్లో నటించడానికే మొగ్గుచూపుతున్నారు. దర్శకుడు కొరటాల శివ సినిమాను కమర్షియల్ తెరకెక్కించడంతో పాటు, సోషల్ ఎలిమెంట్స్ ఎలివేట్ చేస్తుంటాడు. చిరు, కొరటాల కలయికలో ప్రస్తుతం ‘ఆచార్య’ వస్తోంది. ఈ సినిమా తర్వాత యువ దర్శకుడు సుజిత్ తో ‘లూసిఫర్ ’ చేయాలని చిరు భావిస్తున్నాడు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ అక్కడ ఘనవిజయం సాధించింది. ఈ చిత్ర కథ పవన్ కూడా నచ్చిందనే వార్తలు కూడా వచ్చాయి. ఆ నేపథ్యంలో తమ్ముడు పవన్ కల్యాణ్ ‘లూసిఫర్’ చేస్తానంటే.. తాను ఆ సినిమా వదులుకోవడానికి సిద్ధమని కూడా చిరు చెప్పారు. అయితే తాజాగా లూసిఫర్ చిత్రంపై చిరు క్లారిటీ ఇచ్చాడు. అలాగే తనకు బాబీ, మెహర్ రమేష్ కథలు చెప్పారని.. అలాగే సుకుమార్, హరీష్ శంకర్, పరశురామ్ కూడా తనతో పనిచేసే ఆలోచనలో ఉన్నారని చిరంజీవి తెలిపారు. పూరి జగన్నాథ్ కూడా మెగాస్టార్ తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఆశపడుతున్నాడు. మరి పూరి కి మెగాస్టార్ ఆ చాన్స్ ఇస్తాడో లేదో కూడా తెలియాలి. మరి బాస్ ఎవరి కథకు పచ్చా జెండా ఊపుతాడో .. ఎవరితో జట్టు కడతాడో తెలియాలంటే కొంతకాలం వేచిచూడాలి.

tags :chiranjeevi, megastar, lucifer,acharya, sujith, koratala

Next Story