- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో జంటగా నటించిన చిరంజీవి, విజయశాంతి.. తెలుగు సినీ చరిత్రలో ఓ హిట్ పెయిర్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఒసేయ్ రాములమ్మ సినిమాలో రాములమ్మగా అభిమానాన్ని సంపాదించిన విజయశాంతి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి బిజీగా మారారు. కొంతకాలం కిందట రాజకీయాల్లోకి ఎంటరైన చిరు.. మళ్లీ సినిమాలు చేస్తున్నారు. విజయశాంతి కూడా సరిలేరు నీకెవ్వరూ చిత్రంతో.. సెకండ్ ఇన్నింగ్స్కు తెరతీశారు. అయితే చిరు చేయబోయే చిత్రంలో విజయశాంతి నటించనున్నట్లు సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’ను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు యువ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించబోతున్నాడు. కాగా ‘లూసిఫర్’ చిత్రంలో మంజు వారియర్ పాత్ర చాలా కీలకం. ఆ పాత్రను తెలుగులో లేడీ సూపర్స్టార్ విజయశాంతి చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. మలయాళంలో మోహన్ లాల్ కథానాయకుడిగా చేసిన ‘లూసిఫర్’ అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా తెలుగు నేటివిటీకి తగ్గట్టు లూసిఫర్ స్క్రిప్ట్లో మెగాస్టార్ కొన్ని మార్పులను సూచించినట్లు తెలుస్తోంది.