‘మా’ ఎన్నికలపై చిరంజీవి సీరియస్.. కృష్ణంరాజుకు లేఖ

by  |
Chiranjeevi, Krishnam raju
X

దిశ, వెబ్‌డెస్క్: “మా”లో జరుగుతున్న పరిణామాలపై మెగాస్టార్ చిరంజీవి సీరియస్ అయ్యారు. ఎన్నికల పేరుతో ఒకరిపైన మరొకరు విమర్శలు చేసుకోవటాన్ని చిరంజీవి తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం ‘మా’ ఎన్నికలపై క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజుకు మెగాస్టార్ చిరంజీవి లేఖ రాశారు. ‘మా’ ఎన్నికలు వెంటనే జరుపాలని లేఖలో చిరంజీవి పేర్కొన్నారు. ఎన్నికలు ఆలస్యమయితే చాలా సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని అన్నారు. సభ్యుల బహిరంగ ప్రకటనతో ‘మా’ ప్రతిష్ట మసకబారుతోందని వెల్లడించారు. ‘మా’ ప్రతిష్ట దెబ్బతీస్తోన్న ఎవర్నీ ఉపేక్షించొద్దు అని సూచనలు చేశారు. కాగా, మా ఎన్నికల్లో మెగా బ్రదర్ నాగబాబు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌ ప్యానల్‌కు మద్దతు పలికారు. దీంతో మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఆయనకే అని అర్థం అయ్యింది. కానీ, ఎన్నికలు ఎప్పుడు జరిగే విషయంపై క్లారిటీ రాలేదు.

Next Story

Most Viewed