ఆ ఒక్క టెస్టుతో కలిసిపోయిన ముగ్గురు

by  |
ఆ ఒక్క టెస్టుతో కలిసిపోయిన ముగ్గురు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఒకే తల్లి కడుపున పుట్టిన ముగ్గురు అక్కాచెల్లెల్లు డీఎన్ఏ పరీక్ష‎తో ఒక్కటయ్యారు. వీరు వివిధ కారణాలతో హైదరాబాదులోని వేరు వేరు షెల్టర్ హోమ్స్‎లో ఉంటున్నారు. ఈ అక్కాచెల్లెలు తమకు తోబుట్టువులున్నాట్లు తెలపడంతో వెల్ఫేర్ అధికారులు వారికోసం వెతకడం మొదలెట్టారు. ఇలా నగరంలోని అన్ని షెల్టర్ హోమ్స్‌లో వెతగ్గా కొందరిని గుర్తించారు. బాలికలు తెలిపిన వాటిలో మ్యాచ్ అయిన వారికి డీఎన్ఏ టెస్ట్ చేయడం ద్వారా ముగ్గురక్కాచెల్లెల్లు కలిశారు. దీంతో వారి ఆనందాలకు అవదులు లేకుండా పోయాయి. ఎట్టకేలకు తమను ఒక్కటిచేసిన అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా వెల్ఫేర్ అధికారి ఆకేశ్వర్ రావు సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ కి తెలపారు. ముగ్గురక్కాచెల్లెలని కలిపేందుకు కృషిచేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed