సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా ఆయన పేరును సూచించిన జస్టిస్ బోబ్డే

by  |
next cji
X

దిశ, వెబ్‌డెస్క్: త్వరలో పదవీ విరమణ చేయనున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎ బోబ్డే తన వారసుడిగా జస్టిస్ ఎన్‌వీ రమణ పేరును ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన న్యాయశాఖకు లేఖ రాశారు. తన వారసుడిగా జస్టిస్ ఎన్‌వీ రమణ పేరును ప్రతిపాదిస్తున్నట్టు న్యాయశాఖకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. వచ్చే నెల 23న బోబ్డే పదవీ విరమణ చేయనున్నారు. దీంతో తదుపరి సీజేఐ ఎవరనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు కొద్దిరోజుల్లోనే వెలువడనున్నాయి. ప్రస్తుత సీజేఐ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుంటే సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా ఎన్‌వీ రమణ నియమితులవనున్నారు.

ఎవరీ ఎన్‌వీ రమణ..?

జస్టిస్ ఎన్‌వీ రమణ పూర్తి పేరు నూతలపాటి వెంకట రమణ. ఆంధ్ర్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పొన్నవరంలో 1957 ఆగస్టు 27న జన్మించారు. 1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రమణ బీఎస్సీ, బీఎల్ చదివారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్(క్యాట్), ఉమ్మడి ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ప్రాక్టీసు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్‌గా పనిచేశారు. 2000 జూన్ 27న ఏపీ హైకోర్టు పర్మినెంటు జడ్జిగా నియమితులయ్యారు. 2013 సెప్టెంబరు 2న ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆ తర్వాత 2014 ఫిబ్రవరి 17న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2022 ఆగస్టు 26 వరకూ ఆయనకు సర్వీసు ఉంది.


Next Story