సుందరీకరణ పనులు చేపట్టాలి !

by  |
సుందరీకరణ పనులు చేపట్టాలి !
X

దిశ, ఏపీ బ్యూరో: తిరుపతి రుయా, స్విమ్స్, బర్డ్ ఆస్పత్రుల అవరణలో ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు సుందరీకరణ పనులు చేపట్టాలని తుడా ఛైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సూచించారు. శనివారం తుడా కార్యాలయంలో అభివృద్ధి పనులపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా చూడాలని, టీటీడీ తుడాకు అప్పగించిన డివైడర్ నిర్వహణ పనులు ప్రారంభించాలని కోరారు. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు పురోగతిని తెలియజేయాలన్నారు. అనంతరం రెవెన్యూ అధికారులతో సమావేశంపై పలు అంశాలపై చర్చించారు.

Next Story

Most Viewed