అన్ని రకాల మెరుగైన సేవలు చేస్తున్నాం..

by  |
అన్ని రకాల మెరుగైన సేవలు చేస్తున్నాం..
X

దిశ, బెల్లంపల్లి: రైతుల శ్రేయస్సుకు ప్రభుత్వం నిత్యం కృషి చేస్తోందని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. గురువారం బెల్లంపల్లి వ్యవసాయ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్, ఎమ్మెల్సీ పురాణం సతీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ..

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందుబాటులో అన్ని రకాల మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగానే వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం కళ్యాణి, వైస్ చైర్మన్‌గా మోట పలుకుల రాజశేఖర్‌కు కమిటీ పాలకవర్గ సభ్యులు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయించారు.



Next Story