ఆ ఇద్దరికి ఐపీఎల్ ఆటగాళ్ల నివాళులు

by  |
ఆ ఇద్దరికి ఐపీఎల్ ఆటగాళ్ల నివాళులు
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ క్రికెటర్, కామెంటేటర్ డీన్ జోన్స్‌, గాన గంధర్వుడు ఎస్పీ బాలు మృతి అందరినీ కలిచివేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ముఖ్యంగా ఎస్పీ బాలు ఈ రోజు మధ్యాహ్నం కన్ను మూయడంతో యావత్ దేశం శోక సంద్రంలో మునిగింది.

అయితే, వీరిద్దరి మృతికి సంతాపంగా ఐపీఎల్ ఆటగాళ్లు నివాళులు అర్పించారు. ఐపీఎల్ 13 సీజన్‌లో భాగంగా జరుగుతున్న ఏడో మ్యాచ్‌ చెన్నై-ఢిల్లీ మధ్య జరుగుతుంది. కాగా, ఆటగాళ్లందరూ డీన్ జోన్స్, ఎస్పీ బాలు మృతికి సంతాపంగా నల్ల బ్యాండులు చేతులకు ధరించి మైదానంలోకి దిగారు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన తన అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌లో షేర్ చేసింది.


Next Story

Most Viewed