మా మిడిల్ ఆర్డర్ తడబడింది : ధోనీ

by  |
మా మిడిల్ ఆర్డర్ తడబడింది : ధోనీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌ 2020లో భాగంగా బుధవారం అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు అద్భుత విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని మాట్లాడుతూ.. ‘కోల్‌కతా జట్టు మిడిల్ ఓవర్లలో రెండు, మూడు మంచి ఓవర్లు వేసింది. అక్కడే మేం లయ తప్పాము. మేం కూడా వికెట్లు కోల్పోకుండా కాస్త జాగ్రత్త పడాల్సింది. ఇక సామ్ కర్రన్ బంతితో మంచి ఫామ్‌లో ఉన్నాడు. అది మా జట్టుకు కలిసొచ్చింది. కోల్‌కతాను పరుగులు చేయకుండా కట్టడి చేయగలిగినా.. మా మిడిల్ ఆర్డర్ తడబడింది. మేం మరింత సాధన చేయాల్సిన అవసరం ఉంది.’ అని ధోని వెల్లడించారు.

Next Story

Most Viewed