హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి చెక్కు అందజేత

by  |
హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి చెక్కు అందజేత
X

దిశ, హైదరాబాద్: విధి నిర్వహణలో మరణించిన హెడ్ కానిస్టేబుల్ చంద్రయ్య కుటుంబానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆయన కుటుంబానికి రూ.2.70 లక్షల చెక్కును అందజేశారు. శంషాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న చంద్రయ్య 2020 ఏప్రిల్ 17న లివర్ క్యాన్సర్ తో మరణించారు. హెడ్ కానిస్టేబుల్ చంద్రయ్య కుటుంబాన్ని ఆదుకునేందుకు 2000 బ్యాచ్ కు చెందిన పోలీసు సిబ్బంది ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే రూ. 2.70 లక్షలను విరాళంగా సీపీ గారి చేతుల మీదుగా భార్య రేణుక, కుటుంబ సభ్యులకు అందజేశారు..

Next Story

Most Viewed