- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, క్రైమ్ బ్యూరో : సిమ్ యాక్టివేషన్ పేరుతో సైబర్ నేరగాళ్లు అమాయకులకు ఫోన్ చేసి వారి ఖాతాలను కొల్లగొడుతున్నారు. 24 గంటల్లో సిమ్ గడువు ముగిసిపోతున్నందున వెంటనే మీ నెట్ వర్క్ (ఎయిర్ టెల్) ను అప్ డేట్ చేసుకోవాలంటూ ఒక అపరిచిత వ్యక్తి నగరానికి చెందిన ఓ మహిళకు జనవరి 17న ఫోన్ చేశాడు. ఎయిర్ టెల్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నట్టు చెప్పడంతో నమ్మిన సదరు మహిళ మోసగాడు చెప్పినట్టుగా టీం వివర్ క్విక్ సపోర్ట్ రిమోట్ కంట్రోల్ యాప్ను డౌన్ లోడ్ చేసుకుంది. అతని ఆదేశాల ప్రకారం.. మహిళ తన ఖాతా నుంచి రూ.10 లు పంపడంతో మోసగాడు ఐదు సార్లు రూ.6.40 లక్షలను వెంటవెంటనే బాధితురాలి బ్యాంక్ ఖాతా నుంచి తన ఖాతాలోకి డ్రా చేసుకున్నాడు.
ఈ విషయంపై బాధితురాలి ఫిర్యాదు మేరకు రాచకొండ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. నిందితుడు జార్ఖండ్ రాష్ట్రం జాంతారా ప్రాంతానికి చెందిన బిర్ బాల్ పండిట్గా గుర్తించి అరెస్టు చేశారు. ఈ కేసులో భాగస్వాములుగా ఉన్న మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు రాచకొండ సీసీఎస్ ఏసీపీ హరినాథ్ తెలిపారు.